సిరిసిల్ల బ్రాండ్ను అభివృద్ది చేయడమే లక్ష్యం
తెలంగాణ మంత్రి కెటిఆర్
సిరిసిల్ల: కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా మూత పడిన చేనేత పరిశ్రమ మళ్లి పునఃప్రారంభంమైందని తెలంగాణ మంత్రి కెటిఆర్ అన్నారు. బతుకమ్మ చీరలు నేయడం కొనసాగిస్తామని అన్నారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. సిరిసిల్ల చేనేత సోదరులు, సోదరీమణుల ప్రతిభ పట్ల తాను ఎంతో గర్విస్తున్నాని, సిరిసిల్ల చేనేత ఉత్పత్తులంటే ఓ ఎన్నదగిన బ్రాండ్గా అభివృద్ది చేయడమే స్థానిక ఎమ్మెల్యేగా తన లక్ష్యమని కెటిఆర్ వివరించారు. ఈ స్వప్నం సాకారం కావాలంటే టెక్స్టైల్ పార్క్లు, అప్పెరల్ పార్క్ ఎంతో కీలకమని తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/