డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగ‌తిపై సమీక్ష

minister-ktr

హైదరాబాద్‌: డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగ‌తిపై మంత్రులు కెటిఆర్‌, వేముల ప్ర‌శాంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ల‌క్ష ఇండ్లు త్వ‌ర‌లోనే పూర్త‌వుతాయ‌న్నారు అధికారులు. ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని అధికారుల‌ను మంత్రి కెటిఆర్‌ ఆదేశించారు. క‌లెక్ట‌ర్ల‌తో క‌లిసి ఎంపిక చేయాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌నర్‌కు ఆదేశాలు జారీ చేశారు. గ‌తంలో అందిన వారికి మ‌రోసారి ఇళ్లు రాకుండా చూడాల‌న్నారు. ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ పూర్తిగా పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌న్నారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్న చోట ప‌చ్చ‌ద‌నానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని అధికారుల‌ను కెటిఆర్‌ ఆదేశించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్, పుర‌పాల‌క‌, గృహ నిర్మాణ శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/