ఫ్లైఓవర్‌ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్‌

రూ.426 కోట్లతో నగరంలో వంతెన నిర్మాణ పనులు

minister-ktr-inaugurated-Two-new-Bridges-work

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి నగరంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి ఇందిరాపార్కు వద్ద శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ.. ఎస్సార్‌డీపీలో భాగంగా రెండు వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. రూ.350 కోట్లతో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు ఎలివేటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జి, రెండో దశలో రూ.76 కోట్లతో రాంనగర్‌ నుంచి బాగ్‌లింగపల్లి వరకు మూడు లేన్ల వంతెన నిర్మిస్తామని తెలిపారు. రూ.6 వేల కోట్లతో ఎస్సార్‌డీపీ పనులు చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైరదాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తిచేస్తామని చెప్పారు. రూ.5 వేల కోట్లతో స్కైవేల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తిచేస్తామన్నారు. 18 కి.మీ. చొప్పున రెండు ఎలివేటెడ్‌ కారిడార్లు ప్రతిపాదించామని తెలిపారు. రక్షణ రంగ భూములు ఇచ్చేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషిచేయాలన్నారు. రు. ఎస్సార్‌డీపీలో భాగంగా రెండు వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేష్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/