మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు
కాళేశ్వరం నీళ్లు మూడు నెలల్లో వస్తాయని, గోదావరి జలాలతో సింగూరు దాహార్తిని తీర్చుతాము
హైదరాబాద్: సంగారెడ్డిలో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హారిష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనని అన్నారు. కాళేశ్వరం నీళ్లు మూడు లేక నాలుగు నెలల్లో వస్తాయని , గోదావరి జలాలతో సింగూరు దాహార్తిని తీర్చుతామని హారిష్ రావు చెప్పారు. సంగారెడ్డిని దత్తత తీసుకుని అన్ని వార్డులు తిరుగుతానని, సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ది చేస్తానని భరోసా ఇచ్చారు. ఇంకా మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని చెప్పారు.
తాజా ఎపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/