జనగామజిల్లాలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం
పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
జనగామ: పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నగామ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా నిర్మాణ పనుల విషయమై పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..త్వరలోనే జనగామజిల్లా లో టిఆర్ఎస్పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. సాధ్యమైనంత త్వరగా పార్టీ కార్యాలయాన్ని పూర్తిచేస్తే వెంటనే ప్రారంభిస్తామన్నారు. మంత్రి వెంట జనగామ జెడ్పీఛైర్మన్ పాగాల సంపత్రెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/