వృత్తిలో విలువలు ఉన్నప్పుడే వ్యాపారం అభివృద్ధి
వ్యాపారం ద్వారా సమాజానికి ఎంత మంచి జరిగిందో అందరూ ఆలోచించాలి
హైదరాబాద్: వ్యాపారం అభివృద్ధి చెందిందా లేదా అని కాకుండా వ్యాపారం ద్వారా సమాజానికి ఎంత మంచి జరిగిందో అందరూ ఆలోచించాలని మార్గదర్శి డైరెక్టర్ శైలజా కిరణ్ అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఆమె ప్రసంగించారు. వృత్తిలో విలువలు ఉన్నప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని శైలజా కిరణ్ సూచించారు. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ తప్పులను రెండో సారి చేయకూడదని చెప్పారు. వ్యాపారులు ఏం చేయగలరో అదే చెప్పాలని..అదే చేయాలని సూచించారు. వినియోగదారుడి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించాలన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/