భారత హీరోలకు సెల్యూట్

జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నా

mahesh-babu-met-jawans
mahesh-babu-met-jawans

హైదరాబాద్‌: 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు వెల్లడించారు. ఈమేరకు ట్వీట్‌ చేశారు.
‘మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న భారత హీరోలకు సెల్యూట్ చేస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ తెలుపుతున్నట్టుగా సూపర్‌స్టార్‌ పేర్కొన్నారు. లేడీ అమితాబ్‌ విజయశాంతి, చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా మహేశ్‌తో ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/