లోకేశ్వరి ఆత్మహత్య కేసులో పోలీసులు ముందడుగు!
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న లోకేశ్వరి ఉదంతం తీవ్ర కలకలం రేపగా, కేసు విచారణలో పోలీసులు కీలక ముందడుగు వేశారు. దర్యాఫ్తును ముమ్మరం చేసిన పోలీసులు, మృతురాలిని ప్రవీణ్ కుమార్ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వేధించేవాడని తేల్చారు. అతని కోసం గాలిస్తున్నాం, అతని చివరి కాల్ సిగ్నల్ బెంగళూరులో ఉన్నట్టు తేలిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతని ఇంట్లో, అతని బంధువుల ఇంట్లోనూ గాలించినా ప్రయోజనం లేకపోయిందని, అతని బంధువుల్లో అనుమానితులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా ఈ ఘటనలో లోకేశ్వరి మృతదేహం పూర్తిగా కాలిపోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహానికి కాచిగూడ విద్యుత్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/