ఎమ్మెల్యె సుధీర్‌ రెడ్డికి కీలక పదవి

MLA Sudheer Reddy
MLA Sudheer Reddy

హైదరాబాద్‌: ఎల్‌బి నగర్‌ ఎమ్మెల్యె దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి కి కీలక పదవి దక్కింది. మూసి నది తీరప్రాంత అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఆయనను నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తాజాగా ఈ పదవికి ప్రభుత్వం కేబినేట్‌ హోదా కల్పించింది. దీంతో ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున గెలిచిన సుధీర్‌ రెడ్డి… తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరారు. అయితే తాను ఎల్‌బి నగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అధికార పార్టీ హామీ ఇచ్చినందువల్లే పార్టీలో చేరుతున్నట్లు ఆయన అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ పదవి దక్కడం గమనార్హం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/