డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్

హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వం ఉద్ధేశం. అందులో భాగంగా నేడు కూకట్ పల్లి నియోజకవర్గం, బాలానగర్ చిత్తారమ్మ బస్తీలో నిర్మించిన 108 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రులు కెటిఆర్ మరియు సిహెచ్ మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యె మాధవరం కృష్ణారావు, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుమునుపు కూకట్ పల్లిలోని కె పి హెచ్ బి కాలనీలో రూ. 5.65 కోట్లతో నిర్మించిన మినీ ఇండోర్ స్టేడియంను కెటిఆర్ ప్రారంభించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/