రేపు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన..

minister-ktr-speech-in-credai-property-show

తెలంగాణ మంత్రి కేటీఆర్ రేపు బుధువారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. సిద్ధిపేట రెడ్డి ఫంక్షన్ లో ఉదయం 11 గంటలకు అంకిరెడ్డిపల్లె సర్పంచ్ గోపాల్ రెడ్డి కుమారుడి వివాహం జరగనుండగా, ఈ పెళ్లికి కేటీఆర్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సెస్ చైర్మన్ పదవీప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో ఎల్లమ్మ సిద్ధోగం (కల్యాణమహోత్సవం) వేడుకలకు తరలి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్లారెడ్డిపేట మండలం వదిరకు చెందిన దళితబంధు లబ్దిదారులు దళితబంధు పథకంలో భాగంగా అక్కపల్లి స్టేజ్ వద్ద నిర్మించుకుంటున్న రైల్ మిల్లుకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేట సాయిమణికంఠ గార్డెన్ లో రాజన్నపేట సర్పంచ్ శంకర్ సోదరుడి పెళ్లికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇలా రేపంతా కూడా కేటీఆర్ బిజీ బిజీ గా గడపనున్నారు. కేటీఆర్ పర్యటన సందర్బంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.