జూబ్లీహిల్స్‌లో లింక్‌రోడ్‌ను ప్రారంభించిన కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ జూబ్లీహిల్స్‌లో కొత్తగా నిర్మించిన లింక్‌రోడ్‌ను ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 70 నుంచి ప్రశాసన్‌నగర్‌ నార్నె రోడ్‌ నంబర్‌ 78 వరకు రూ. 2.81 కోట్ల వ్యయంతో 0.47 కి.మీ. మేర ఈ లింక్‌రోడ్డును నిర్మించారు. దీనిద్వారా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌దర్గారోడ్డు ద్వారా సులభంగా పాత ముంబై రోడ్డుకు వెళ్లే అవకాశం ఉంటుంది. నగరంలో మరో ఐదు లింక్‌ రోడ్లను జీహెఎంసీ కొత్తగా నిర్మించింది. ఈ కార్యక్రమంలో మంతి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/