వింగ్స్‌ ఇండియా సమావేశానికి కెటిఆర్‌

వింగ్స్‌ ఇండియా 2020కి తెలంగాణ ఆతిథ్యం

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత పొందిన వింగ్స్‌ ఇండియా సన్నాహక సమావేశానికి తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కు ఆహ్వానం అందింది. గురువారం ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి కెటిఆర్‌ వెళ్లనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కేంద్రమంత్రి హర్దీప్‌సిగ్‌ పూరి కెటిఆర్‌ను కోరారు. కాగా ఈ సారి వింగ్స్‌ ఇండియా 2020కి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 12 నుంచి 15 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టులో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ వైమానికి రంగ భాగస్వామ్య కంపెనీలు, పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు పాల్గొననున్నారు. దేశ వైమానిక రంగంలోనే తెలంగాణ చాలా కీలకమైన భూమిక పోషిస్తుందని కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/