కీసర గుట్ట నా నియోజకవర్గంలో వుండటం నా పూర్వ జన్మ సుకృతం
తెలంగాణ ప్రజలు పాడిపంటలతో, సుఖశాంతులతో ఉండాలని రామలింగేశ్వర స్వామిని కోరుకున్నాను
మేడ్చల్: కీసర గుట్ట నా నాయోజకవర్గ పరిధిలో వుండటం నా పూర్వ జన్మ సుకృతం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరాయంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్లతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు పాడిపంటలతో, సుఖశాంతులతో ఉండాలని ఆ రామలింగేశ్వరస్వామిని ప్రార్థించాను అని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ..మహాశివరాత్రి పర్వదినాన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/