గోనెసంచిలో లభ్యమైన వ్యాపారి మృతదేహం
హైదరాబాద్: నగరంలోని జూబ్లిహిల్స్లో తీవ్ర కలకలం రేగింది. జవహర్నగర్ ప్రాంతంలో ఓ గోనెసంచిలో మృతదేహం లభ్యమైంది. చేపల వ్యాపారి రమేశ్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి, అనంతరం శవాన్ని జవహర్నగర్ ప్రాంతంలోని ఓ పెంట్హౌస్ వద్ద పడేశారని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన చేపల వ్యాపారి రమేష్ను రెండు రోజుల క్రితం దుండగులు కిడ్నాప్ చేశారు. రూ.90 లక్షలు ఇస్తే వదిలిపెడతామని.. లేదంటే చంపేస్తామని కుటుంబ సభ్యులను బెదిరించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు డబ్బులు ఇవ్వాలని డెడ్లైన్ పెట్టారు. ఆ లోపు డబ్బులు అందకపోవడంతో అతడిని కిరాతకంగా చంపేశారు. ఐతే రెండు రోజుల క్రితమే కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. దానిపై దర్యాప్తు జరగుతున్న క్రమంలోనే రమేశ్ శవమై కనిపించాడు. ఈ మర్డర్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లిహిల్స్ పరిధిలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి గాలిస్తున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/