వ్యవసాయ రంగాన్ని కెసిఆర్‌ ప్రోత్సహిస్తున్నారు

ముఖ్యమంత్రి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరపాలి

niranjan reddy
niranjan reddy

హైదరాబాద్‌: దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రోత్సహిస్తున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కెసిఆర్‌ జన్మదినోత్సవాన్ని ప్రతి ఏటా రైతు దినోత్సవంగా జరపాలని వ్యవసాయశాఖ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. కంది రైతులు ఆందోళన చెందవద్దని సీఎం చెప్పారన్నారు. కేంద్రం 47500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పిందని వెల్లడించారు. తెలంగాణలో 2లక్షల మెట్రిక్‌ టన్నుల కంది ఉత్పత్తి అయిందని.. మిగిలిన కందిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. దళారులకు సహకరించే ఉద్యోగులను జైలుకు పంపుతామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేంద్రం ఇచ్చాం.. రాష్ట్రం తీసుకుంది అనే విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చేది కాదని.. పంపిణీ చేసే స్థానంలో మాత్రమే ఉందన్నారు. కేంద్రం ప్రత్యేకంగా సంపాదించి పెట్టేది లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం తిరోగమన విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/