ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ గట్టి పోటినిచ్చింది

మున్సిపల్‌ ఎన్నికల్లో అభివృద్ధి చర్చకు రాలేదు..కేవలం డబ్బు ప్రవాహమే

Jagga Reddy
Jagga Reddy

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ గట్టి పోటీనిచ్చిందని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అభివృద్ధి అనే చర్చ రాలేదని..కేవలం డబ్బు ప్రభావమే ఉందన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..సంగారెడ్డిలో మేము ఓడిపోవడం మంచిదేనని గెలిస్తే మేము మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ పనీ చేయలేకపోయేవాళ్లమని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ గెలిచినా, ఓడినా ఎప్పుడూ హీరోనే అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన రాష్ట్ర కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కాగా సంగారెడ్డి కాంగ్రెస్‌కు కంచుకోట అని అలాంటి చోట టిఆర్‌ఎస్‌ జెండా ఎగరేసిన మంత్రి హరీష్‌ రావును అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పినట్టుగా 100 స్థానాల్లో టిఆర్‌ఎస్‌ జెండా ఎగిరందన్నారు. దానికి కృషి చేసిన కెటిఆర్‌ను అభినందిస్తున్నానని జగ్గారెడ్డి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/