రేపు కేసీఆర్ ను కలవబోతున్న జగన్..

ఏపీ సీఎం జగన్ రేపు మాజీ సీఎం కేసీఆర్ ను కలవబోతున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో డిసెంబర్ 7న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యశోద ఆసుపత్రి వర్గం.. హిప్ రీప్లేస్​మెంట్ సర్జరీ చేసారు. వారం రోజుల పాటు హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్..ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి. బంజారాహిల్స్ నందినగర్‌లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా 3 నుంచి 4 వారాల టైం పడుతుంది. ఇక కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారని తెలిసి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నేతలు , ఇతర పార్టీల నేతలు చంద్రబాబు , ఒవైసి, రేవంత్ రెడ్డి తదితరులు కాకుండా సినీ ప్రముఖులు సైతం హాస్పటల్ కు వెళ్లి కేసీఆర్ ను పరామర్శించడం జరిగింది. ఇక ఇప్పుడు ఏపీ సీఎం జగన్..రేపు మద్యాహ్నం కేసీఆర్ ఇంటికి చేరుకొని ఆయన్ను పరామర్శిస్తున్నారు.