నయీమ్‌ కుటుంబ సభ్యులకు ఐటీ నోటీసులు

Nayeem’s Family
Nayeem’s Family

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబసభ్యులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం భువనగిరిలోని నయీమ్ ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించారు. నయీమ్ తల్లి తహేరాబేగం, సోదరి సలీమా, భార్య హసీనా బేగం, అతని అనుచరుడు పాశం శ్రీనివాస్ పేరిట నోటీసులు జారీ అయ్యాయి. చాలాకాలం తరువాత మళ్లీ గ్యాంగ్ స్టర్ నయీమ్ వ్యవహారంలో కదలిక రావడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది చివరిలో గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువకు సంబంధించి ఇందుకోసం ఏర్పాటు సిట్ కీలక ప్రకటన చేసింది. కాగా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ హతమైన విషయం తెలిసిందే. అయితే నయీమ్‌ ఆస్తులపై విచారణ జరిపిన సిట్‌ అతనికి రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని వెల్లడించింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, గోవా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఈ ఆస్తున్నాయని తెలిపింది. వేయి 15 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలున్నాయని, మొత్తం 29 భవనాలు ఉన్నాయని వెల్లడించారు. 1.90 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 2.8 కోట్ల నగదున్నాయని తెలిపారు. 258 సెల్ ఫోన్లు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలున్నాయని, మారణాయుధాలున్నాయని సిట్ అధికారులు తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/