గాంధీలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు

Two more Coronavirus positives in Hyderabad
Two more Coronavirus positives in Hyderabad

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కలకలం సృష్టింస్తోంది. రెండు రోజుల క్రితం గాంధీలో తొలి కేసు నమోదవ్వగా.. తాజాగా మరో రెండు కేసులు కూడా వచ్చి చేరాయి. మరో ఇద్దరిలో కూడా వైరస్‌ లక్షణాలను గుర్తించారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు. గాంధీ మెడికల్ కాలేజీలోని ఐసీఎమ్ఆర్‌‌ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. దాంతో, వారి శాంపిల్స్‌ను తదుపరి పరీక్షల కోసం పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలాజీ (ఎన్ఐవీ)కి పంపించారు. గురువారం ఎన్‌ఐవీ నుంచి రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. ఎన్ఐవీలో కూడా పాజిటివ్‌ అని తేలితే ఆ ఇద్దరికీ కరోనా సోకిందని నిర్ధారిస్తారు. ఈ ఇద్దరిలో ఒకరు వైరస్‌ బారిన పడిన సాఫ్ట్‌వేర్‌‌ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తి కాగా, మరొకరు ఇటలీకి వెళ్లొచ్చినట్టుగా గుర్తించారు. ఇక, కరోనా బారిన పడి గాంధీ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న సాప్ట్‌వేర్‌‌ ఉద్యోగి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/