వరంగల్‌ లో హైలర్ట్‌

అధిక సంఖ్యలో నమోదు అవుతున్న కరోనా కేసులు

warangal
warangal

వరంగల్‌: జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలో లాక్‌డౌన్‌ నిబందనలను మరింత కఠినం చేశారు. జిల్లాలో కంటైన్‌మెంట్‌ ప్రాంతాలలో డ్రోన్‌ లతో రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. అత్యవసర సేవలు అవసరమయిన వారికి కూడా పూర్తి వివరాలు సేకరించి పంపుతున్నారు. వరంగల్‌ పూరి గుట్టలో పది సంవత్సరాల పాపకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ ఏరియాను కంటైన్‌మెంట్‌ జోన్‌ గా ప్రకటటించారు. ఈ ప్రాంతంలో వైద్యులు ఇంటింటి సర్వే మొదలు చేపడుతున్నారు. కాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకు కూడా ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలలొ కరోనా కేసులు నమోదు కాలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/