కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై గుత్తా ఫైర్‌

రాష్ట్ర విభజన రాత్రిళ్లు చేసుకున్నారని అవహేళన చేయడం కిషన్‌రెడ్డికి తగదు

gutha sukender reddy
gutha sukender reddy

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కేంద్ర ప్రభుత్వం చట్టాలను అగౌరవ పరుస్తోందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. రాష్ట్ర విభజన రాత్రిళ్లు చేసుకున్నారని అవహేళన చేయడం కిషన్‌ రెడ్డికి తగదన్నారు. డిలిమిటేషన్‌ ప్రక్రియ జమ్మూకాశ్మీర్‌కే వర్తిస్తుందని అనడం విడ్డూరమన్నారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించి రెండు తెలుగు రాష్ట్రాలో డిలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టాలన్నారు. పట్టణ ప్రగతి మంచి కార్యక్రమమని, ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే కార్యక్రమమని అన్నారు. దీనికి రాజకీయాలు జోడించాల్సిన అవసరం లేదని గుత్తా సుఖేందర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/