కొత్త రెవెన్యూ చట్టంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న నూతన రెవెన్యూ బిల్లుతో పాటు మిగతా బిల్లులు చట్టం రూపం దాల్చాయి. కీలకమైన రెవెన్యూ చట్టంతో పాటు మొత్తం 12 బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో భూ హక్కులు పాసు పుస్తకాలు, వీఆర్వోల రద్దు, టీఎస్ బీపాస్, పురపాలక, పంచాయతీరాజ్, ప్రైవేటు వర్సిటీలు, తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య పరిస్థితి బిల్లు, తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు, తెలంగాణ ఫిస్కల్ రెస్సాన్స్బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్లు, తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు, తెలంగాణ సివిల్ న్యాయస్థానాల సవరణ బిల్లుతో పాటు జీఎస్టీ సవరణ చట్టాల అమలుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ మేరకు రాష్ర్ట న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ బిల్లులన్నీ అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/