శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు
నిజామాబాద్: శ్రీరాంసార్ ప్రాజెక్టులోని వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ఆయకట్టు ప్రాంతంలో రైతులు వరినారుమల్లు సిద్ధం చేసుకుంటున్నారు. సాగర్లో ప్రస్తుతం 1091 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టానికి గానూ 1071 అడుగుల వద్ద నీరు నిలువ ఉంది. ఈ ప్రాజెక్టుకు 91 టీఎంసీల సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం 30.998 టీఎంసీల నీరు నిలువ ఉంది. దీంతో ఆయకట్టు ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/