గాంధీలో చేరిన ఐదుగురు కరోనా అనుమానితులు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా చైనాకు చెందిన కరోనా వైరస్ భయాందోళనలకు గురి చేస్తుంది. భారత్లో తొలి సారిగా కేరళలో ఈ వైరస్ సోకిన ఇద్దరు వ్యక్తులను అధికారులు గుర్తించారు. భారత్లో దీనిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే మంగళవారం నలుగురు, బుధవారం నలుగురు కరోనా అనుమానితులు గాంధీలో చేరారు. తాజాగా ఈ రోజు మరో ఐదుగురు కరోనా వైరస్ అనుమానితులు చేరడంతో హైదరాబాద్లో కరోనా భయం పెరుగుతోంది. వరంగల్కు చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్టు వైద్యులు గుర్తించారు. ఐదు రోజుల క్రితం వరంగల్ వాసి చైనా నుంచి వచ్చారు. దీంతో వరంగల్ వాసి కుటుంబసభ్యులతో పాటు గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఐదుగురి శాంపిల్స్ సేకరించిన వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/