రోడ్డు ప్రమాదం..చెన్నకేశవులు తండ్రి మృతి
దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య
హైదరాబాద్: దిశ దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య మృతి చెందాడు. బైక్ పై వెళుతున్న కూర్మయ్యను ఓ ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. గాయాలపాలైన అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. కాగా కూర్మయ్య గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన్నాడు. ఇటీవలే కూర్మయ్యను కుటుంబ సభ్యులు స్వగ్రామం గుడిగండ్లకు తీసుకువచ్చారు. కొన్నిరోజుల కిందటే చెన్నకేశవులు భార్య రేణుక అమ్మాయికి జన్మనివ్వగా, ఇంతలోనే కూర్మయ్య మరణించడం వారి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/