ధరణి ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత
హైదరాబాద్: ధరణి ఆస్తుల నమోదుపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి ఆస్తుల నమోదును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అధికారులు వరద సహాయక చర్యల్లో పాల్గొంటుండటంతో ఆస్తుల నమోదును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత సర్వేను కొనసాగిస్తామని వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఆస్తుల నమోదు చేపట్టొద్దని ఆదేశాలు జారీచేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/