రాష్ట్ర సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం

కోర్టు తీర్పుతో పనులు ప్రారంభించిన ప్రభుత్వం

Telangana-Secretariat

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజాము నుంచే భారీ యంత్రాలతో భవనం కూల్చివేత పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ వైపుగా వాహనాలు రాకుండా రోడ్లను మూసివేశారు. నిజానికి కూల్చివేత పనులు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడంతో పనులు ఆలస్యమయ్యాయి. సచివాలయ భవనం కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. పాత భవనాన్ని కూల్చివేసి ఆ స్థానంలో కొత్తదాన్ని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించింది. ప్రస్తుతం సచివాలయ సిబ్లాక్‌ను కూల్చివేసే పనులు ప్రారంభించింది. కాగా కూల్చివేతను సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/