రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ధోరణి కూడా అల్లర్లకు కారణం

ఢిల్లీ ఘటనలో పోలీసులను అతి కిరాతకంగా చంపారు

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ చొరబాటుదారులు ఎక్కువయ్యారు

kishan reddy
kishan reddy

హైదరాబాద్‌: రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ధోరణి కూడా అల్లర్లకు కారణమవుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో ఏర్పాటు చేసిన ఐడియాన్‌ ఫర్‌ ఇండియా-2020 ఐఎస్‌బీ పాలసీ కాంక్లేవ్‌ను కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలే ఢిల్లీ అల్లర్లకు కారణమని అన్నారు. ఢిల్లీ ఘటనలో పోలీసు అధికారులను కిరాతకంగా చంపారని కిషన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి చొరబాటుదారులు ఎక్కువయ్యారని, విధ్వంసాలు సృస్టిస్తున్నారని అన్నారు. ఇంకా పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్న భారత్‌వైపు ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. నేటి యువతరం కొత్త ఒరవడులకు నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం సామాజికంగా, ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలనే విషయంలో ఐడియాస్‌ కాంక్లేవ్‌ ఉపయోగపడుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/