సీఆర్‌పీఎఫ్‌ ఎస్సై ఆత్మహత్య

క్వార్టర్స్‌లోని వినోద గదిలో ఘటన

suside
suside

: సీఆర్‌పీఎఫ్‌ ఎస్సైగా పనిచేస్తున్న ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఆర్‌పీఎఫ్‌ క్వార్టర్స్‌లోని వినోద గదిలో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతను రాజస్థాన్‌కు చెందిన భవాని శంకర్‌(30) అని తెలిసింది. అయితే బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/