కరోనా కలవరం: మరింత శుభ్రంగా మెట్రో
హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్నది. తెలంగాణలోనూ కేసులు నమోదవ్వడంతో.. తెలంగాణ ప్రభుత్వంయుద్ధ ప్రతిపాదికన చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను, ప్రభుత్వ శాఖలను అలర్ట్ చేసింది. రద్దీగా ఉండే ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారించింది. ఆర్టీసీ బస్సులను కూడా శుభ్రం చేయిస్తూ ప్రజలకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా.. హైదరాబాద్ మెట్రో కూడా అన్ని మెట్రో రైళ్లను, మెట్రో స్టేషన్లను శుభ్రం చేయిస్తోంది. క్లీనింగ్ సిబ్బంది.. మెట్రో రైళ్లలోని అంగుళం అంగుళాన్ని స్పిరిట్, కెమికల్స్ చల్లుతూ శుభ్రం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లను కూడా మరింత పరిశుభ్రంగా మార్చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/