బ్యాంకు సిబ్బందికి కరోనా టెన్షన్
డబ్బు కోసం బ్యాంకుకు వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్
Hyderabad: హైదరాబాద్లోని పాతబస్తీలో ఓ బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా టెన్షన్ పట్టు కుంది.
డబ్బు కోసం బ్యాంకుకు వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో… అది తనకు కూడా ఎక్కడ సోకిందోనని బ్యాంకు సిబ్బందితోపాటు బ్యాంకుకు వెల్లిన జనం కూడా ఆందోళన చెందుతున్నారు.
బాధితురాలు కంటైన్మెంట్ జోన్ నుంచి వచ్చి నట్లు నిర్ధారణ కావడంతో బ్యాంకు సిబ్బంది అందరినీ క్వారంటైన్కు తరలించారు.
ఇప్పటికే హైదరాబాద్లో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కోవిడ్-19 సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 504 కేసు ల్లో 452 హైదరాబాద్లోనివేనని వైద్య, ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/