ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు అత్యంత ప్రాధాన్యం

రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి గంగుల

Minister Ganguly Kamalakar

కరీనంగర్‌: మంత్రి గంగుల కమలాకర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి లో ఆయన రైతు వేదిక నిర్మాణానికి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సిఎం కెసిఆర్‌ అనేక రకాల ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే రైతుకు, ఉపాధ్యాయుడికి అత్యంత గౌరవం ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులకు సమున్నత గౌరవం లభించే విధంగా సిఎం కెసిఆర్‌ పని చేస్తున్నారని చెప్పారు. రైతు వేదికల నిర్మాణం ఒక చారిత్రాత్మక అవసరం అన్నారు. రైతు వేదికల నిర్మాణం ద్వారా దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకునేందుకు రైతులకు వీలు కలుగుతుందన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/