అక్కడ కెసిఆర్‌ను ఓడించడమే మాలక్ష్యం

కుటుంబానికి సిఎం కెసిఆర్‌ పదవుల పంపకాలు చేస్తున్నారంటూ రేవంత్‌ రెడ్డి ఫైర్‌

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కెసిఆర్‌ పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. కుటుంబసభ్యులకు పదవుల పంపకాలపై కెసిఆర్‌ మల్లగుల్లాలు పడుతున్నారని అన్నారు. పోలీసు కేసుల పేరుతో విపక్ష నేతలను భయపెట్టాలని చూస్తున్నారని… కేసులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటామని, వారికి అండగా ఉంటామని తెలిపారు. కెసిఆర్‌ అడ్డా గజ్వేల్ లో టిఆర్‌ఎస్‌ ను ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. కెసిఆర్‌ దుష్టపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తిని కలిగిస్తామని చెప్పారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/