విద్యానగర్‌లో రక్తదాన శిబిరం ప్రారంభం

రక్తదానం చేయడానికి దాతలు ముందుకు రావాలి. తలసాని

talasani srinivasa yadav
talasani srinivasa yadav

హైదరాబాద్‌: రాష్ట్రంలో జీవాలకు గ్రాసం అందించడంలోను, వైద్య సేవలలోను పశుసంవర్ధక శాఖ సమర్దవంతంగా పనిచేస్తుందని, తెలంగాణ పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. ప్రపంచ పశువైద దినోత్సవ సందర్బంగా విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్‌ భవనంలో రక్త దాన శిభిరాన్ని మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా మంత్రి మట్లాడుతు, రాష్ట్రంలో రక్తం నిల్వలు తగ్గిపోయాయని, రక్తదానం చేయడానికి దాతలు ముందుకు రావాలని అన్నారు. తలసేమియా రోగులకు ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రక్తదానం చేసిన ఉద్యోగులు , సిబ్బందిని ఆయన అభినందించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/