చవకబారు ప్రచారం కోరుకోను
త్వరలో కార్గో బస్సులను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్: ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలే తప్ప, చవకబారు ప్రచారం పొందాలనుకోవడం తనకు ఇష్టం లేదని సిఎం కెసిఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణలో సరకు రవాణా చేసే కార్గో బస్సులపై కెసిఆర్ ఫొటోలు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోందన్న వార్తలు రావడంతో ఆయన పైవిధంగా స్పందించారు. బస్సులపై ఫొటోలతో ప్రచారం చేసుకోవాల్సినంత అవసరం తనకు లేదని అన్నారు. ఇలాంటి అంశాలను తాను ప్రోత్సహించబోనని స్పష్టం చేశారు. అటు, కార్గో బస్సులపైసిఎం ఫొటోలు వద్దంటూ ఆర్టీసీకి సిఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే పథకాల్లో భాగంగా కొత్తగా కార్గో బస్సులను తీసుకువస్తున్నారు. సిఎం కెసిఆర్ చేతులమీదుగా ఈ బస్సులను ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/