లాక్డౌన్ పై సిఎం కెసిఆర్ సమీక్ష
మరికాసేపట్లో మీడియా ముందుకు సిఎం కెసిఆర్ ..
లాక్డౌన్ పై కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్లు సమాచారం
హైదరాబాద్:రాష్ట్రంలో విదించిన లాక్డౌన్ పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయాలను మరికాసేపట్లో మీడియా ముందు సిఎం కెసిఆర్ వెల్లడించనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/