ధరణి పోర్ట‌ల్‌పై సిఎం కెసిఆర్‌ సమీక్ష

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై రెవెన్యూ అధికారుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. పూర్తి పార‌ద‌ర్శ‌కంగా భూరికార్డుల నిర్వ‌హ‌ణ జ‌రిగేలా పోర్ట‌ల్ త‌యారీపై చ‌ర్చిస్తున్నారు. భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించే దిశ‌గా తీసుకొచ్చిన‌ కీల‌క‌మైన నూత‌న రెవెన్యూ బిల్లు కూడా చ‌ట్ట‌రూపం దాల్చింది. ఈ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలుపడంతో ఇవాళ గెజిట్ నోటిఫికేష‌న్ జారీ అయింది. మొత్తానికి ఈ చ‌ట్టంలో భాగంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను అత్యంత ప‌క‌డ్బందీగా రూపొందించ‌నున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/