ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా కెసిఆర్‌ కృషి

తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు..చిరంజీవి

Chiranjeevi
Chiranjeevi

హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈక్రమంలో సిఎం కెసిఆర్‌ను కొనియాడారు. తెలంగాణ ప్రజల కలను ఆయన సాకారం చేశారని చెబుతూ ట్వీట్ చేశారు. ‘ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీకెసిఆర్ గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని చిరంజీవి పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/