రాజాసింగ్‌ వ్యాఖ్యలను ఖండించిన చైనా

కరోనా.. చైనా వైరస్‌ కాదంటూ లేఖ

rajasingh
rajasingh

హైదరాబాద్‌: ఈ నెల 5న జ్యోతి ప్రజ్వలన కార్యాక్రమంలో భాగంగా, ధూల్‌పేటలో జ్యోతి వెలిగించిన అనంతరం బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ చైనీస్‌వైరస్‌ గో బ్యాక్‌ అంటూ నినదించారు. ఈ వ్యాఖ్యలపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై చైనా రాయబార కార్యాలయం స్పందించింది. ప్రపంచానికి కరోనా గురించి తెలిపిన తొలి దేశం చైనా అని, అంతే కాని ఈ వైరస్‌ చైనాలో పుట్టిందని కాదని పేర్కోంటు రాజాసింగ్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించిన రాజాసింగ్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం ఈ వైరస్‌ను చైనా వైరస్‌ అన్నారని గుర్తు చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/