అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు
టిఆర్ఎస్ నేతలు బెదిరింపులకు దిగితే సహించేది లేదు
భూత్పుర్: బిజెపి ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. టిఆర్ఎస్ నేతలు బెదిరింపులకు దిగితే సహించేది లేదని వారికి తగిన సమధానం చెప్తామన్నారు. శుక్రవారం భూత్పుర్ పురపాలక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రచారంలో బిజెపి నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..టిఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమయిందని చేతలు ఎమి లేవని విమర్శించారు. టిఆర్పార్టీ అన్ని విషయాల్లోనూ ఎంఐఎం పార్టీని అసదుద్దీన్ ఓవైసీని వెనకేస్తోందన్నారు. ఇంకా రాష్ట్రంలో రుణమాఫీ, రైతుబంధు పథకాలు అమలుకావడం లేదని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/