వైద్యులపై దాడులు చేయడం సరికాదు

వారి ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారు

errabelli dayakar rao
errabelli dayakar rao

జనగామ: కరోనా వైరస్‌ వ్యాప్తి నివరాణకు వైద్యులు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని, అలాంటి వారి పలువురు దాడిచేయడం సరికాదని పంచాయితి రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సోమవారం జనగామ ఏరియా హస్పిటల్‌లో గ్రీన్‌కో సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఎండి చెలమశెట్టి అనిల్‌ సౌజన్యంతో 150 పిపిఈ కిట్లను వైద్యులకు పంపిణి చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న వారిపై దాడి చేయడం సరికాదని అన్నారు. కరోనా వైరస్‌ నిర్మూలనలో డాక్టర్‌లు చేస్తున్న సేవలు నిరుపమానమైనవని కొనియాడారు. ఇంతటి కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న దాతల సేవలు మరువలేనివని మంత్రి అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/