బాబ్రీ మసీదు కేసు తీర్పుపై ఒవైసీ అసహనం

భారయతీయ న్యాయ వ్యవస్థలో ఈరోజు చీకటి రోజు.. ఒవైసీ

asaduddin-owaisi

హైదరాబాద్‌: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈతీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతీయ న్యాయవ్యవస్థకు ఈరోజు ఒక చీకటి రోజు అని అన్నారు. అయోధ్యలో వివాదాస్పద భూమికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ… చట్టాలను ఉల్లంఘించారని, పద్ధతి ప్రకారం ప్రార్థనా స్థలాన్ని నాశనం చేశారని వ్యాఖ్యానించిందని చెప్పారు. సీబీఐ కోర్టు తీర్పు బాధాకరమని అన్నారు. మసీదు కూల్చివేత వెనక ఎలాంటి కుట్ర లేదని ఈరోజు కోర్టు తెలిపిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్పును వెలువరించడం కోసం ఎంత కాలం కసరత్తు చేశారని అన్నారు. తాము పై కోర్టుకు వెళతామని చెప్పారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/