తండ్రి ఆత్మహత్య పై స్పందించిన అమృత

అమ్మ దగ్గరకు వెళ్లనన్న అమృత

Amrutha-Pressmeet
Amrutha-Pressmeet

హైదరాబాద్‌: మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కుమార్తె అమృత స్పందించారు. మారుతీరావు అంత్యక్రియలు ముగిసిన అనంతరం అమృత మీడియాతో మాట్లాడింది. ‘మారుతీరావు కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయి. మారుతీరావును శ్రవణ్‌ కొట్టినట్లు తెలిసింది. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో నేను చెప్పలేను. మనిషిని చంపించేంత ధైర్యం ఉన్న వాళ్లు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వారు కాదు. ప్రణయ్‌ హత్యకు ముందు మారుతీరావు ఆస్తులు పంచుకోలేదు. నేను బయటికొచ్చాక ఆస్తులు పంచుకున్నారు. భర్త చనిపోతే భార్య పడే బాధలు నాకు తెలుసు. నా తల్లి దగ్గరకి వెళ్లి ఉండలేను.. నా దగ్గరికి వచ్చి ఉంటా అంటే అభ్యంతరం లేదు. ప్రణయ్ చనిపోయినప్పుడే బలంగా ఉన్నా.. ఇప్పుడెందుకు ఉండలేను’ అని అమృత చెప్పుకొచ్చింది. మారుతీరావు అంత్యక్రియలకు వెళ్లినప్పుడు శ్మశానంలో తనను అడ్డుకోవడం కరెక్టు కాదన్న అమృత, తన తల్లిని ఓదార్చేందుకే తాను అక్కడకు వెళ్లానని తెలిపింది. ఆస్తి వివరాలు తనకు తెలియవన్న అమృత… మారుతీరావు, ఆయన భార్య అందరూ శ్రవణ్ కంట్రోల్ లోనే ఉంటారని అంది. మారుతీరావు చనిపోవడానికి తమ్ముడు శ్రవణ్ తనతో మాట్లాడకపోవడం కూడా కారణం కావచ్చని అభిప్రాయపడింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/