అమర రాజా గ్రూప్ రూ.6 కోట్లు విరాళం
సంస్థ గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లా వెల్లడి
Amaravati/Hyderabad: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు తమ వంతు సాయంగా అమర రాజా గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లా విరాళం ప్రకటించారు.
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కు రూ.5 కోట్లు , తెలంగాణ ప్రభుత్వంకు రూ. కోటి విరాళం గా ప్రకటించారు.
ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించిన రూ. 5 కోట్ల రూపాయల చెక్కు ను అమర రాజా గ్రూప్ చైర్మన్ డా.రామచంద్ర ఎన్ గల్లా, కుమార్తె రమాదేవి సోమవారం జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తాకు అందజేశారు.
తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) వ్యాసాల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/kids/