తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈరోజు ఉదయం పది గంటలకు ప్రారంభమైన శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని టీఆర్ఎస్ సభ్యుడు ఆరూరి రమేశ్ ప్రవేశపెట్టగా, మరో సభ్యుడు వివేకానంద బలపరిచారు. ఈ తీర్మానంపై సీఎం కేసీఆర్ సహా అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. అనంతరం శాసనసభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/