తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

Telangana assembly
Telangana assembly

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈరోజు ఉదయం పది గంటలకు ప్రారంభమైన శాసనసభలో గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని టీఆర్​ఎస్​ సభ్యుడు ఆరూరి రమేశ్​ ప్రవేశపెట్టగా, మరో సభ్యుడు వివేకానంద బలపరిచారు. ఈ తీర్మానంపై సీఎం కేసీఆర్​ సహా అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. అనంతరం శాసనసభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి ప్రకటించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/