తప్పించుకునే యత్నంలో నిందితుడు మృతి

పోలీసులమని నమ్మించి మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు

accused died in zahirabad
accused died in zahirabad

సంగారెడ్డి: మహిళపై గ్యాంప్ రేప్‌కు పాల్పడిన నిందితుల్లో ఒకరు పోలీసుల నుంచి తప్పించుకోబోయి ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఈ ఘటన జహీరాబాద్ సమీపంలో చోటు చేసుకుంది. నిన్న జహీరాబాద్ బస్టాండ్ దగ్గర ఓ మహిళను పోలీసుల పేరు చెప్పి తీసుకెళ్లిన ఇద్దరు దుండగులు… ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బీదర్ నుంచి వచ్చిన మహిళను బస్టాండ్‌లో కొద్దిసేపు గమనించిన ఇద్దరు దుండగులు ఆమె దగ్గర గుట్కా ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. ఆమెను పోలీసులమంటూ బెదిరించి తమతో తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తనపై జరిగిన అత్యాచార ఘటన విషయాన్ని సదరు మహిళ పోలీసుల దృష్టికి తీసుకురావడంతో… వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూసిన నిందితులు కారులో పారిపాయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అతివేగంతో కారు నడపంతో అది ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక నిందితుడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో నిందితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/