డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ ఓల్వో బస్సు

ద్రాక్షారామం నుండి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం

Volvo Bus
Volvo Bus

సూర్యాపేట: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అతివేగం ప్రమాదకరం అని పోలీసులు ఎంత హెచ్చరించినా కొందరు డ్రైవరన్నలు దాన్ని పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఈ జాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది. ఓల్వో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ఘటన మునగాల మండలం తాడువాయి గ్రామ శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. అంతా క్షేమంగా ఉన్నారు. ద్రాక్షారామం నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/