ఆక్సీజన్ అందక నలుగురి మృతి

మృతుల్లో ముగ్గురు కరోనా వైరస్‌ బాధితులు

four-Patients-died-in-Nizamabad-Hospital

నిజమాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఆక్సీజన్ అందక నలుగురు రోగులు మరణించారు. వీరిలో ముగ్గురు కరోనా పేషెంట్లు ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఆక్సిజన్ సిలిండర్ అయిపోవడంతో.. శ్వాస ఆడక వీరు చనిపోయారు. కోవిడ్ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు పేషెంట్లతో పాటు సాధారణ వార్డులో మరొకరు కన్నుమూశారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పేషెంట్లు చనిపోయారని ధర్నాకు దిగారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆస్పత్రి వద్ద బందోబస్తు పెంచారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/