తన అహంకారమే తన పతనానికి దారి తీస్తుంది
తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పై మండిపడ్డాడు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లే కెసిఆర్ సిఎం అయ్యారని అన్నారు. అధిస్టానాన్ని ఒప్పించి తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ నాయకులు బఫూన్లు అయ్యారా? అంటూ ప్రశించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కెసిఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆరే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, రైతుల బాగు కోసం రైతు సంక్షేమ దీక్ష చేస్తే చూసి తట్టుకోలేక అహంకారంగా మాట్లాడుతున్నారని అన్నారు. కెసిఆర్ అహంకారమే తన పతనానికి దారితీస్తుందని అన్నారు. కాగా రైతుల పంట కొనుగోలు చేయాలని, ఇప్పటి వరకు కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నేతలు మంగళవారం రైతు సంక్షేమ దీక్ష చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/